రూ. 100 వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ: త్వరలోనే విడుదల

Published : Feb 15, 2023, 09:46 AM ISTUpdated : Feb 15, 2023, 09:55 AM IST
రూ.  100  వెండి నాణెంపై  ఎన్టీఆర్ బొమ్మ:  త్వరలోనే విడుదల

సారాంశం

ఎన్టీఆర్  బొమ్మతో  రూ. 100  వెండి  నాణెం త్వరలోనే విడుదల కానుంది. ఈ నాణెం నమూనాను  మింట్ అధికారులు దగ్గుబాటి పురంధేశ్వరికి చూపారు. 

అమరావతి:టీడీపీ వ్యవస్థాపకులు  నందమూరి తారకరామారావు బొమ్మతో  రూ. 100  నాణెం  విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.  ఈ వంద రూపాయాల  నాణెం  పూర్తిగా వెండితో  తయారు చేయనున్నారు.  ఎన్టీఆర్ బొమ్మతో  రూపొందించనున్న  నాణెం  నమూనాను  మింట్  అధికారులు   మాజీ కేంద్ర మంత్రి  దగ్గుబాటి పురంధేశ్వరికి  చూపించారు.  ఈ నాణెంపై  సలహలు, సూచనలు కోరారు. 

2022  మే  28వ తేదీ నుండి   ఎన్టీఆర్ శత జయంతి  ఉత్సవాలు  నిర్వహిస్తున్నారు.  ఈ ఉత్సవాలను  పురస్కరించుకొని   ఈ వెండి నాణెన్ని  విడుదల చేసే అవకాశం  ఉందని  సమాచారం.   ఎన్టీఆర్ శత జయంతి   ఉత్సవాలను  ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పాటు  ఈ ఉత్సవాలు  నిర్వహిస్తున్నారు. 

చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా  నాణెలను విడుదల చేస్తుంటారు. 1964 నుండి   ఇలా  నాణెల విడుదల  చేయడం ప్రారంభించారు.తొలుత  నెహ్రు  స్మారకార్ధం  నాణెం విడుదల చేశారు.   మాజీ ప్రధాని  వాజ్ పేయ్  చిత్రంతో  కూడా  నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu