మద్యం మత్తులో ట్రైన్ రావడం గమనించక.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు..

Published : Jan 23, 2021, 10:46 AM IST
మద్యం మత్తులో ట్రైన్ రావడం గమనించక.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు..

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు టౌన్‌లో విషాద ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై మద్యం సేవించి మత్తులో మునిగిపోయిన ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ట్రైన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు టౌన్‌లో విషాద ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై మద్యం సేవించి మత్తులో మునిగిపోయిన ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ట్రైన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాలు.. తంగెళ్లముడికి చెందిన సిద్దూ(23), కొత్తపేటకు చెందిన భరత్‌(25), పవన్‌లు గతరాత్రి ఏలూరు బస్టాండ్‌ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ పై మద్యం సేవించారు. ఆ మత్తులో తాము ట్రాక్స్ పై ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయారు. 

దీంతో రైలు వస్తున్నా వారికి తెలియలేదు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురూ రైలు వస్తున్నా ట్రాక్‌పై అలాగే కూర్చుండిపోవడంతో.. రైలు వారిపై నుంచి దూసుకుపోయింది. 

ఈ ప్రమాదంలో భరత్‌, సిద్దూలు మరణించగా పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu