నర్సీపట్నంలోని జ్యుయలరీ దుకాణంలో అగ్ని ప్రమాదం: ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

By narsimha lodeFirst Published Nov 20, 2022, 11:07 AM IST
Highlights

అనకాపల్లి  జిల్లాలోని నర్సీపట్నంలో  ఓ  జ్యుయలరీ  దుకాణంంలో  జరిగిన  అగ్ని ప్రమాదంలో  ఇద్దరు  మృతి  చెందారు.  మరో  ఇద్దరు  గాయపడ్డారు.  షార్ట్  సర్క్యూట్ కారణంగా  ప్రమాదం  జరిగిందని  పోలీసులు భావిస్తన్నారు.

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్నీపట్నంలోని ఓ  జ్యుయలరీ  దుకాణంలో  అగ్ని ప్రమాదంతో  తండ్రీకొడుకులు   మృతి చెందారు. ఈ ప్రమాదంలో  మరో ఇద్దరు  గాయపడ్డారు.  నర్సీపట్నంలోని కృష్ణాబజారులో  ఉన్న  జ్యుయలరీ షాపులో  ఆదివారంనాడు  తెల్లవారుజామున  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.   ఈ  ప్రమాదంలో  జ్యుయలరీ  దుకాణ  యజమాని  నానాజీ ఆయన  తనయుడు  మౌలేష్   మృతి  చెందారు.  ఈ ప్రమాదంలో  మరో  ఇద్దరు  గాయపడ్డారు.  ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా  అధికారులు  భావిస్తున్నారు. 

click me!