నిన్న యువకుడు, నేడు యువతి.. విశాఖ రుషికొండ బీచ్‌లో మృతదేహాల కలకలం

Siva Kodati |  
Published : Aug 12, 2022, 02:22 PM IST
నిన్న యువకుడు, నేడు యువతి.. విశాఖ రుషికొండ బీచ్‌లో మృతదేహాల కలకలం

సారాంశం

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. నిన్న ఓ యువకుడి మృతదేహం కొట్టుకురాగా.. శుక్రవారం యువతి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. 

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. రుషికొండ సముద్రతీరానికి గురువారం ఒక యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది.. అతనిని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. ఇదిలావుండగా శుక్రవారం తెల్లవారుజామున ఇదే బీచ్‌కు యువతి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆమెను విజయనగరం జిల్లాకు చెందిన దివ్యగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి ఆత్మహత్యగా భావిస్తున్నారు. వీరికి సంబంధించి వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఏమైనా నమోదయ్యాయా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ