తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. రికార్డులు సృష్టిస్తోన్న హుండీ , 21 రోజుల్లోనే 100 కోట్ల పైచీలుకు ఆదాయం

Siva Kodati |  
Published : Jul 23, 2022, 03:22 PM IST
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. రికార్డులు సృష్టిస్తోన్న హుండీ , 21 రోజుల్లోనే 100 కోట్ల పైచీలుకు ఆదాయం

సారాంశం

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఏ నెలకు ఆ నెల రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ జూలై నెలలోనే తొలి 21 రోజుల్లో రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా.

తిరుమల (tirumala) శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా కేవలం 21 రోజుల్లోనే శ్రీవారి హుండీ ద్వారా రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. జూలై నెలలో టీటీడీ (ttd) చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు గత మే నెలలో రూ.130 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటిసారి శ్రీవారికి రూ.140 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. 

ALso Read:రికార్డు బ్రేక్: ఒక్క రోజులోనే టీటీడీకి రూ. 6.18 ఆదాయం

ఇకపోతే.. ఈ నెల 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచీలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి. గతంలో 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకల్ని హుండీలో వేశారు భక్తులు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలకు రాలేని భక్తులు.. ఇప్పుడు పరిస్ధితులు కుదుటపడటంతో పోటెత్తుతున్నారు. ఈ కారణం చేతనే హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోందని అధికారులు అంటున్నారు. ఇకపోతే వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోన్న సంగతి తెలిసిందే. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా వేస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu: ధూళిపాళ్ల నరేంద్ర కూతురి పెళ్లిలో చంద్రబాబు | Wedding Video | Asianet News Telugu
అమరావతిలో అంతులేని అవినీతిరాజధానిపై మరోసారి YS Jagan Sensational Comments | Asianet News Telugu