కృష్ణా నదిలో తేలుతూ కనిపించిన మహిళ.. నిమిషాల్లో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు (వీడియో)

By Siva KodatiFirst Published May 15, 2022, 8:29 PM IST
Highlights

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో  పడిపోయిన మహిళను పోలీసులు రక్షించారు. అమెను ఈతగాళ్ల సాయంతో రక్షించి బయటకు తీసి అనంతరం చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

విజయవాడ (vijayawada) ప్రకాశం బ్యారేజ్ (prakasam barrage) వద్ద కృష్ణా నదిలో ఓ మహిళ తేలుతూ కనిపించింది. ఆదివారం బ్యారేజీపై సెల్ఫీలు దిగుతున్న వారు ఆమెను చూసి అక్కడికి దగ్గరలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై నిమిషాలలో స్పందించారు విజయవాడ వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ ఐ చిట్టిబాబు. అమెను ఈతగాళ్ల సాయంతో రక్షించి బయటకు తీసి అనంతరం చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

 

"

click me!