విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో పడిపోయిన మహిళను పోలీసులు రక్షించారు. అమెను ఈతగాళ్ల సాయంతో రక్షించి బయటకు తీసి అనంతరం చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విజయవాడ (vijayawada) ప్రకాశం బ్యారేజ్ (prakasam barrage) వద్ద కృష్ణా నదిలో ఓ మహిళ తేలుతూ కనిపించింది. ఆదివారం బ్యారేజీపై సెల్ఫీలు దిగుతున్న వారు ఆమెను చూసి అక్కడికి దగ్గరలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై నిమిషాలలో స్పందించారు విజయవాడ వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ ఐ చిట్టిబాబు. అమెను ఈతగాళ్ల సాయంతో రక్షించి బయటకు తీసి అనంతరం చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.