ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల: ఏపీ సీఎం జగన్‌తో రాజమౌళి, దానయ్య భేటీ

Published : Mar 14, 2022, 04:26 PM ISTUpdated : Mar 14, 2022, 05:07 PM IST
ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల: ఏపీ సీఎం జగన్‌తో రాజమౌళి, దానయ్య భేటీ

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్యలు సోమవారం నాడు భేటీ అయ్యారు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సీఎంతో వీరిద్దరూ భేటీ అయ్యారు.ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ప్రముఖ దర్శకుడు Rajamouli , RRR సినిమా నిర్మాత DVV Danaiah సోమవారం నాడు సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బేటీ అయ్యారు. ఈ నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ Cinema విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.  ఏపీ ప్రభుత్వం ఇటీవలనే సినిమా Ticket ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు G.O.ను కూడా జారీ చేసింది.

 వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సినిమాలకు  రెండు వారాలు టికెట్ ధరలను పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అయితే ఈ జీవోలోని కొన్ని సాంకేతిక అంశాలను రాజమౌళి, నిర్మాత దానయ్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై టికెట్టు ధరలను పెంచుకొనేందుకు  ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి సినిమా నిర్మాణ సంస్థ ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

AP Assembly వాయిదా పడిన తన్వాత సీఎం జగన్ నేరుగా తాడేపల్లికి చేరుకొన్నారు. Hyderabad నుండి ప్రత్యేక విమానంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్యలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ఏపీ సినిమాటోగ్రపీ శాఖ మంత్రి Perni Nani తో కలిసి రాజమౌళి, దానయ్యలు సీఎం YS Jagan తో భేటీ అయ్యారు. 

సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీన జీవో జారీ చేసింది.కార్పోరేషన్లలోని  నాన్ ఏసీ థియేటర్లలో  ప్రీమియం టికెట్  ధర రూ.60లుగా,  నాన్ ప్రీమియం టికెట్ రూ.40గా నిర్ణయించారు.ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100 గా నిర్ణయం తీసుకొన్నారు. మల్టీప్లెక్సులలో రెగ్యులర్  టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250 గా నిర్ణయించారు. 

 మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.50గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30గా నిర్ణయం తీసుకొన్నారు. ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో  ప్రీమియం టికెట్ ధర రూ.80గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80గా మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250గా నిర్ణయించారు.

నగర పంచాయితీ, గ్రామ పంచాయితీల్లో నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20, ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లులో ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.గా నిర్ణయించారు.ఈ టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. 

భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. రూ.100 కోట్లు, అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు  ఇది వర్తిస్తుంది. అయితే ఏపీ సర్కారు ఇక్కడో షరతు విధించింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చిన్న సినిమాలు ఐదో షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu