Road Accident: రక్తమోడిన రహదారులు..  గుంటూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. స్పాట్ లోనే ముగ్గురు దుర్మ‌ర‌ణం 

Published : Aug 16, 2022, 03:00 AM IST
Road Accident: రక్తమోడిన రహదారులు..  గుంటూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. స్పాట్ లోనే ముగ్గురు దుర్మ‌ర‌ణం 

సారాంశం

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఘోర‌ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆగి ఉన్నలారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సోమవారం సాయంత్రం ఆగి ఉన్న లారీని అతివేగంగా  ప్ర‌యాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం..  ఇద్దరు అమ్మాయిలతో సహా మొత్తం నలుగురు వ్యక్తులు కారులో ఉన్నారు.  గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తుండగా జాతీయ రహదారి-16పై తుమ్మలపాలెం గ్రామం వద్ద రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి కారు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంద‌గా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.  కాగా.. 108 వాహనంలో జీజీహెచ్​కు తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.

 ప్రత్తిపాడు పోలీసు అధికారి మాట్లాడుతూ..  లారీ టైర్ పగిలిపోవడంతో రోడ్డు ప‌క్క‌న నిలిపారు.  విజయవాడ నుంచి వస్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అందులో ఉన్నవారు మృతి చెందారు.మృతుల్లో ముగ్గురు కాకినాడకు చెందిన చైతన్య పవన్, విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి, విశాఖపట్నానికి చెందిన సౌమికగా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే నాలుగో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

యూపీలోని మెయిన్‌పురిలో ఘోర రోడ్డు ప్రమాదం 

అదే సమయంలో.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. సరయాతో కూడిన ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రమాదం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అతని భార్య ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. అదే సమయంలో, ట్రక్కులో ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు మరియు ఇద్దరు మరణించారు. ఈ మొత్తం విషయంపై మెయిన్‌పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ సమాచారం అందించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, ముగ్గురు గాయాలు

దీనికి కొద్ది రోజుల ముందు..  ఆగస్టు 12 న,  తెలంగాణలోని నిజామాబాద్‌లో కారు ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించారు.  ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు కారులో వెళ్తుండగా ముక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

కారు డ్రైవర్ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతలివైపు ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu
Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu