మూడు రాజధానులను నిరసిస్తూ రామవరం జాతీయ రహదారిపై రాస్తారోకో

Published : Jan 20, 2020, 05:05 PM ISTUpdated : Jan 20, 2020, 06:45 PM IST
మూడు రాజధానులను నిరసిస్తూ రామవరం జాతీయ రహదారిపై  రాస్తారోకో

సారాంశం

మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ ఏపీ రాష్ట్రంలోని  రామవరం గ్రామానికి చెందిన రైతులు సోమవారం నాడు రాస్తారోకో నిర్వహించారు. 

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రామవరం వద్ద  మూడు రాజధానులను నిరసిస్తూ సోమవారం నాడు జేఎసీ నేతలు ఆందోళనలకు దిగారు.

మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ జ్యోతుల నవీన్ కుమార్‌ ఆధ్వర్యంలో  జేఎసీ నేతలు రోడ్డుపై భైఠాయించి  ఆందోళనకు దిగారు.  జాతీయ రహదారిపై టైర్లు కాల్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.

టైర్లను దగ్దం చేయడంతో  రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  జాతీయ రహాదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.  దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

ఆందోళనకారులను పోలీసులు  అరెస్ట్ చేశారు. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేయడంతో వాహనదారుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

ఎమ్మెల్యేల స్కిట్ కామెడీ పడి పడి నవ్విన మంత్రులు, సీఎం| Asianet News Telugu
AP Food Commission Chairman: అధికారులకి చెమటలు పట్టించిన ఏపీ ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet Telugu