ఆలూరు వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డగింత: తాడిపత్రిలో ఉద్రిక్తత

Published : Apr 06, 2023, 04:58 PM IST
ఆలూరు వెళ్లకుండా జేసీ  ప్రభాకర్ రెడ్డి అడ్డగింత: తాడిపత్రిలో  ఉద్రిక్తత

సారాంశం

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు  ఇవాళ  అడ్డుకున్నారు.  ఆలూరు రంగనాథస్వామి రథోత్సవంలో  పాల్గొనకుండా పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు.  


అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని  తాడిపత్రిలో  గురువారంనాడు  ఉద్రిక్తత  నెలకొంది.  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని  ఆలూరుకు వెళ్లకుండా  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో  పోలీసులతో  జేసీ ప్రభాకర్ రెడ్డి  వాగ్వాదానికి దిగారు. ఆలూరు రంగనాథస్వామి  ఆలయ రథోత్సవానికి వెళ్లకుండా  అడ్డుపడడంపై   పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఆలూరులో రంగనాథస్వామి  రథోత్సవరం కార్యక్రమానికి  ఎమ్మెల్యే  కేతిరెడ్డి  పెద్దారెడ్డి హాజరు కానున్నారు. ఇదే  కార్యక్రమానికి  జేసీ ప్రభాకర్ రెడ్డి కూడ హాజరైతే   శాంతి బద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని  పోలీసులు భావించారు.  దీంో  ఆలూరు రంగనాథస్వామి  రథోస్వానికి  జేసీ ప్రభాకర్ రెడ్డిని వెళ్లకుండా  పోలీసులు  అడ్డుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

పెమ్మసాని స్పీచ్ కి దద్దరిల్లిన సభ సీఎం చంద్రబాబు ఫిదా | Asianet News Telugu
CM Chandrababu Speech: హీరో మోటార్స్ విస్తరణ సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu