వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా: సీబీఐకి హైకోర్టు సూచనలు

Published : Apr 17, 2023, 04:41 PM ISTUpdated : Apr 17, 2023, 05:07 PM IST
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్  విచారణ  రేపటికి వాయిదా: సీబీఐకి  హైకోర్టు  సూచనలు

సారాంశం

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ  ఈ నెల  18వ తేదీకి  వాయిదా  వేసింది, 

హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు  బెయిల్ పిటిషన్ పై విచారణను  రేపటికి వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు. మరో వైపు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు  సాయంత్రం  నాలుగు  గంటల తర్వాతే విచారణకు  పిలవాలని సీబీఐకి సూచించింది  తెలంగాణ హైకోర్టు .

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో  ఇవాళ  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై  ఇవాళ  మధ్యాహ్నం విచారణ  జరిగింది.     ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ  సాగుతున్న తరుణంలోనే  సీబీఐ విచారణ  ను వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే  ఇవాళ సాయంత్రం ఐదు గంటల తర్వాత  విచారణ  చేస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.  హౌకోర్టులో  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ  నేపథ్యంలో  ఇవాళ  విచారణను  రేపటికి వాయిదా వేసింది  సీబీఐ .

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు  బెయిల్ పిటిషన్ పై  వైఎస్ సునీతారెడ్డి  కూడా ఇంప్లీడ్  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను  హైకోర్టు  అనుమతించింది.  ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ సమయంలో  సీబీఐ, వైఎస్ అవినాష్ రెడ్డి  లాయర్లు  మధ్య  కీలక వాదనలు  జరిగాయి.  వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్  చేస్తారా అని సీబీఐ న్యాయవాదిని   హైకోర్టు ప్రశ్నించింది.  అవసరమైతే  వైఎస్ అవినాష్ రెడ్డిని  అరెస్ట్  చేస్తామని  హైకోర్టుకు  సీబీఐ తరపు న్యాయవాది  చెప్పారు. ఈ మేరకు  సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

also read:అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం: ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక వాదనలు

 ఇరువర్గాల వాదనలు  విన్న తర్వాత  ఈ పిటిషన్ పై విచారణను  రేపటికి  వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు. అయితే  రేపు  వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ  విచారణకు పిలిచిన విషయాన్ని  అవినాష్ రెడ్డి  తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  అయితే  రేపు సాయంత్రం  నాలుగు గంటల తర్వాతే  వైఎస్ అవినాష్ రెడ్డిని  విచారణకు  పిలవాలని సీబీఐకి  సూచించింది  తెలంగాణ హైకోర్టు.
 

PREV
click me!

Recommended Stories

Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu
Nara Lokesh Speech: మంగళగిరి మయూరీ టెక్ పార్క్‌లో APEDB కార్యాలయం ప్రారంభం | Asianet News Telugu