టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద ఆగిపోయింది. చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కామినేని ఆసుపత్రి సమీపంలో కారు ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద ఆగిపోయింది. చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కామినేని ఆసుపత్రి సమీపంలో కారు ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది.
దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న చంద్రబాబును భద్రతా సిబ్బంది మరో కారులో హైదరాబాద్కు పంపారు. ఇప్పటికే చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం 60 వేల కిలోమీటర్లకు పైగా తిరిగింది. ఇందువల్లే వాహనంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది.