కీచక టీచర్ : బాలికను బెదిరించిచ లైంగికదాడి.. తల్లిదండ్రులకు తెలియడంతో..

By AN TeluguFirst Published Jun 17, 2021, 9:20 AM IST
Highlights

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్ ఆ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. బాలికకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైన పనికి దిగజారాడు. 

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్ ఆ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. బాలికకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైన పనికి దిగజారాడు. 

వివరాల్లోకి వెడితే.. చిత్తూరు జిల్లా, మదనపల్లెకు చెందిన ఉపాధ్యాయుడు దినేష్, తన స్కూల్లో చదువుతున్న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఇలా ఒక్కసారి కాదు.. బాలికను బెదిరించి.. గుట్టు చప్పుడు కాకుండా కొద్ది రోజులుగా లైంగింక దాడికి పాల్పడుతున్నాడు.

అంతేకాదు, ఎవరికైనా చెబితే చంపుతానని బాలికను బెదిరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక, ఆ కీచకుడి దాడికి లొంగలేకక మానసికక్షోభ అనుభవించింది. 

చివరికి బాలిక ప్రవర్తలో మార్పులు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా బాలిక భయంతో చెప్పలేదు.. చివరికి గట్టిగా నిలదీయడంతో భోరుమని ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. 

దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఆ కీచకటీచర్ మీద ఫిర్యాదు చేశారు. బాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడుని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!