రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి

Published : Dec 15, 2023, 01:36 PM ISTUpdated : Dec 15, 2023, 01:38 PM IST
 రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి

సారాంశం

ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందారు. 

భీమవరం : రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్సీ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎమ్మెల్సీ  షేక్ సబ్జీ మృతి చెందారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.  ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కాలేదని ప్రాథమిక సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy: చరిత్రహీనులకు ప్రజలే చరమగీతం పాడుతారు: పార్థసారథి| Asianet Telugu
పూరీల మెషిన్ కోసం స్పాట్ లోనే డబ్బులు ఇచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu