
నెల్లూరు జిల్లా స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి వాకాటి నారాయణ రెడ్డి గెలిచారు. నిజానికి ఇక్కడ వైసీపీకి ఆధిక్యత ఉంది. కానీ పోల్ మేనేజ్ మెంట్ వల్ల టిడిపినే గెలిచింది. మొత్తం మీద చాలా అవస్తలు పడిన వాకాటి వైసీపీ అభ్యర్ధి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 85 ఓట్ల మోజారిటీ గెలిచారు. 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. గెలుపు కోసం ఇద్దరు అభ్యర్ధులుp ఎంతో శ్రమించారు. అయితే, అధికారంలో ఉండటం, డబ్బు, అంగబలం పుష్కలంగా ఉండటంతో టిడిపి గెలిచింది. టిడిపికి 464 ఓట్లు రాగా వైసీపీకి 377 ఓట్లు వచ్చాయి. మరో ‘ ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు.