కత్తులు, రాడ్లతో వైసీపీ గుండాలు దాడి చేశారు: చంద్రబాబు

Published : Feb 01, 2021, 08:42 AM IST
కత్తులు, రాడ్లతో వైసీపీ గుండాలు దాడి చేశారు: చంద్రబాబు

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గుండాలు రాళ్లు, కత్తులతో దాడులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

అమరావతి: రాడ్లు, కత్తులు, గొడ్డళ్లతో వైసిపి గుండాలు రోడ్లపై స్వైర విహారం చేస్తూ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  శ్రీకాకుళం లోక్ సభ వైసిపి అభ్యర్ధి  అసభ్యపదాలతో రెచ్చగొట్టి ఈ మూకలను  హింసా విధ్వంసాలకు ప్రేరేపించారని న్నారు.

ప్రశాంతతకు నెలవైన ఉత్తరాంధ్ర హింసా, విధ్వంసాలకు వేదిక కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసిపి రౌడీ మూకలపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసిపి గుండాలకు ప్రజలే మరిచిపోలేని గుణపాఠం త్వరలోనే చెబుతారని అన్నారు.

ఆ మేరకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. వాహనంపై ధీమాగా కూర్చుని పోలీసుల ఎదుటే దుర్ఫాషలాడుడుతున్న దువ్వాడ శ్రీనివాస్ వీడియోను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?