వైసీపి పై పిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు

Published : Aug 18, 2017, 07:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
వైసీపి పై పిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు

సారాంశం

వైసీపి పై ఎన్నిక‌ల క‌మీష‌న్ కు పిర్యాదు చేసిన తెలుగు దేశం ఎంపీలు ప్రజలను మభ్యపెడుతుందని, డబ్బు పంచుతుందని ఆరోపణ. వైసీసి పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి

వైసీపి పై ఎన్నిక‌ల క‌మీష‌న్ కు పిర్యాదు చేసిన తెలుగు దేశం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ, నంద్యాల్లో జ‌గ‌న్ మ‌కాం వేసి మ‌రీ డ‌బ్బులు పంచుతున్నార‌ని కంప్లైంట్ చేశారు.  వైసీసి పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శుక్ర‌వారం నాడు వారు ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

 హైద‌రాబాదు స‌చివాల‌యంలో టీడీపీ ఎంపీలు అద‌న‌పు ప్ర‌ధాన ఎన్నికల అధికారి అనూప్ సింగ్ ను కలిశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఎంపీలు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపి అక్ర‌మాల‌కు పాలుప‌డుతుందన్నారు. జ‌గ‌న్ నంద్యాల్లో గ‌ల్లీ గల్లీకి తిరిగి మరీ డబ్బులు పంచుతున్నారని వారు తెలిపారు. వైసీపి నేత‌లే కాకుండా ఇత‌ర జిల్లాల నుండి విద్యార్థులను తీసుకొచ్చి మ‌రీ ప్ర‌జ‌ల‌కు డ‌బ్బును పంచిపెడుతున్నార‌ని వారు తెలిపారు. త‌క్ష‌ణ‌మే వైసీపి పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలని పెర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu