కేసీఆర్, జగన్ తోడు దొంగలే: కేశినేని నాని విమర్శలు

Published : Jul 01, 2021, 12:26 PM IST
కేసీఆర్, జగన్ తోడు దొంగలే: కేశినేని నాని విమర్శలు

సారాంశం

 రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు  ఇద్దరూ  తోడు దొంగలేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.  నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయమై  రెండు రాష్ట్రాలు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నాయి. ఈ విషయమై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు  ఇద్దరూ  తోడు దొంగలేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.  నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయమై  రెండు రాష్ట్రాలు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నాయి. ఈ విషయమై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా ఎన్నికల ముందు కేసీఆర్, జగన్ మధ్య పరస్పర సహకారం ఉంది.  ప్రజలను ఈ ఇద్దరూ పిచ్చోళ్లను చేసి ఆడుకొంటున్నారన్నారు. హైద్రాబాద్ లోని ఆస్తును కాపాడుకొనేందుకు కేసీఆర్ తోకలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు.  ఏపీ ప్రజలు ఆ డ్రామాలను గమనించలేనంత పిచ్చోలు కాదన్నారు.

also read:జల వివాదం.. ఏపీ - తెలంగాణ నేతల మధ్య మాటల తూటాలు: సాగర్ వద్ద భారీ భద్రత

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ , ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంపై ఏపీపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. ఈ మేరకు రెండు లేఖలను కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ రాసింది.విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ తెలంగాణను ఆదేశించింది. కానీ తెలంగాణ మాత్రం జలవిద్యుత్ ఉత్పత్నిని కొనసాగిస్తోంది.


 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu