ప్రబోధానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట: జేసీ

Published : Sep 19, 2018, 06:02 PM ISTUpdated : Sep 19, 2018, 06:14 PM IST
ప్రబోధానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట: జేసీ

సారాంశం

ప్రబోధానంద స్వామిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రబోధానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందంట అంటూ జేసీ ధ్వజమెత్తారు. ప్రబోధానంద ఆశ్రమం వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన జేసీ ఆశ్రమంలో జరుగుతున్న దుర్మార్గాలను అమరావతిలో సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. 

అమరావతి: ప్రబోధానంద స్వామిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రబోధానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందంట అంటూ జేసీ ధ్వజమెత్తారు. ప్రబోధానంద ఆశ్రమం వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన జేసీ ఆశ్రమంలో జరుగుతున్నదుర్మార్గాలను అమరావతిలో సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. తనపై దాడి జరుగుతున్నా తన గన్‌మెన్‌లు గాలిలో కూడా కాల్పులు జరపలేదని జేసీ చెప్పుకొచ్చారు. అందుకే గన్‌మెన్ల రక్షణను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

ప్రబోధానంద ఆశ్రమంలో పున్నమి, అమావాస్యకు ఆడా, మగ తేడాలేదని ఘాటుగా విమర్శించారు. కోర్కెలు తీర్చుకుంటే స్వర్గం వస్తుందట అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రబోధానంద ఓ కృష్ణుడు, మిగతావాళ్లు గోపికలు. ప్రబోధానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమం లోపలికి పోలీసులు వెళ్లి తనిఖీలు చేస్తే ఆయుధాలు దొరుకుతాయని జేసీ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రబోధానందస్వామి వీడియోలను బాబుకు ఇచ్చిన జేసీ

ప్రబోధానంద స్వామి వీడియోలు బయటపెడతా: జేసీ

చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?

 

PREV
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu