కోవిడ్ 19: కోవాగ్జిన్ వాలంటీర్లుగా గద్దె రామ్మోహన్ దంపతులు

Siva Kodati |  
Published : Dec 09, 2020, 09:07 PM IST
కోవిడ్ 19: కోవాగ్జిన్ వాలంటీర్లుగా గద్దె రామ్మోహన్ దంపతులు

సారాంశం

కరోనా వైరస్‌ నివారణకు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ట్రయల్‌రన్‌కు టీడీపీ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ దంపతులు వాలంటీర్లుగా ముందుకొచ్చారు. 

కరోనా వైరస్‌ నివారణకు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ట్రయల్‌రన్‌కు టీడీపీ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ దంపతులు వాలంటీర్లుగా ముందుకొచ్చారు.

తొలి ట్రయల్‌లో భాగంగా గద్దె రామ్మోహన్‌, ఆయన సతీమణి అనురాధ టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్న తర్వాత అంతా బాగానే ఉందని వారు చెప్పారు. రెండో ట్రయల్‌లో జనవరి 4న రామ్మోహన్‌, అనురాధ మరో డోసు  వేయించుకోనున్నారు.

టీకా వేయించుకున్న అనంతరం రెగ్యులర్‌ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వారికి సూచించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు తాను కూడా సేవ చేశాననే సంతృప్తి మిగులుతుందన్నారు.  

PREV
click me!

Recommended Stories

School Holidays : విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఏపీలో రెండ్రోజులు, తెలంగాణలో మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Weather Update: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్