అప్పుడు కనిపించలేదా రౌడీయిజం: పవన్ కు బోండా కౌంటర్

By Nagaraju TFirst Published Sep 27, 2018, 3:22 PM IST
Highlights

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు రౌడీయిజం, రాజకీయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 
 

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు రౌడీయిజం, రాజకీయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 

ప్రజాపోరాటయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పలు ఆరోపణలు చేశారు. రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను బోండా ఉమ ఖండించారు. 

ప్రజాసమస్యలపై పోరాడితే కేసులు సహజమని బోండా అన్నారు. ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ రాఫెల్‌ స్కాం, జగన్‌ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్.. నేను మాట్లాడితే మూడు రోజులు అన్నం తినవు: చింతమనేని

పులివెందులలో జగన్‌పై మాట్లాడగలవా..? పవన్‌కు... చింతమనేని సవాల్

పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్

సైగ చేస్తే తన్ని తగలేస్తారు: చింతమనేనికి పవన్ హెచ్చరిక

click me!