కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ ఆందోళన

Published : Jan 05, 2019, 10:53 AM IST
కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ ఆందోళన

సారాంశం

కాకినాడలో పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే

కాకినాడలో పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ.. టీడీపీ నేతలు శనివారం గుంటూరులో  ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ కి, కన్నా లక్ష్మీ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. రంగంలోకి వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా పోటీపోటాగా ఆందోళన చేపట్టారు.  మోదీ, కన్నాకి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతల ఆందోళతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu
Job Calendar 2026 : ఏ నెల, ఏ తేదీ, ఏ శాఖలో, ఎన్ని ఉద్యోగాలు.. ప్లాన్ చేసుకుంటే ఓ జాబ్ మీదే