కిరణ్ వల్ల కాంగ్రెస్ కు ఒక్క ఓటే లాభం : డొక్కా వ్యంగాస్త్రాలు

Published : Jul 13, 2018, 06:10 PM ISTUpdated : Jul 13, 2018, 06:20 PM IST
కిరణ్ వల్ల కాంగ్రెస్ కు ఒక్క ఓటే లాభం : డొక్కా వ్యంగాస్త్రాలు

సారాంశం

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఓ గేమ్ ప్లాన్ లో భాగమేనని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అతడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరతాడనని నాలుగేళ్ల క్రితమే తాను తెలియజేసినట్లు గుర్తుచేశారు. ఇలా కాంగ్రెస్ లోకి తిరిగి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల ఆ పార్టీకి కేవలం ఒక్క ఓటు మాత్రమే లాభమని డొక్కా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క ఓటు పెరగడం మినహా కాంగ్రెస్‌కు ఏమీ లాభం లేదని ఎద్దేవా చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఓ గేమ్ ప్లాన్ లో భాగమేనని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అతడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరతాడనని నాలుగేళ్ల క్రితమే తాను తెలియజేసినట్లు గుర్తుచేశారు. ఇలా కాంగ్రెస్ లోకి తిరిగి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల ఆ పార్టీకి కేవలం ఒక్క ఓటు మాత్రమే లాభమని డొక్కా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క ఓటు పెరగడం మినహా కాంగ్రెస్‌కు ఏమీ లాభం లేదని ఎద్దేవా చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా కిరణ్ కుమార్ మూడున్నరేళ్ల పాటు పాలించి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ అవినీతిపై అప్పుడే తాను ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. మా ఇద్దరిపైనా విచారణ జరపాలని అప్పట్లోనే గవర్నర్ కు లేఖ రాశానని అన్నారు. దేశంలో అత్యంత ధనికులైన రాజకీయ నాయకుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకరని మాణిక్య వరప్రసాద్ రావు ఆరోపించారు.

తెలుగు దేశం పార్టీతో కిరణ్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తమ పార్టీలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి బలమైన నాయకుడని, ఆయన సేవలను మాత్రమే టిడిపి వినియోగించుకుంటుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు