పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఎమ్మెల్సీ అనంతబాబు.. కళ్లెదుటే కనిపిస్తున్నా అరెస్ట్ చేయరా : పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

Siva Kodati |  
Published : May 22, 2022, 02:59 PM ISTUpdated : May 22, 2022, 03:03 PM IST
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఎమ్మెల్సీ అనంతబాబు.. కళ్లెదుటే కనిపిస్తున్నా అరెస్ట్ చేయరా : పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

సారాంశం

కాకినాడ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. తెలుగుదేశం , దళిత సంఘాలు చేసిన ఆందోళనల వల్ల హత్య కేసుగా మార్చారని ఆయన అన్నారు. 

కాకినాడలో హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (ysrcp mlc ananthababu) మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం (subramanyam) కుటుంబ సభ్యులను టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం భార్యను ఆయన ఓదార్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. కళ్లముందు నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్తున్నా అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా వుందన్నారు. టీడీపీ, దళిత సంఘాల పోరాటం వల్లే.. సుబ్రమణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐతో (cbi) విచారణ జరిపించాలని సుబ్రమణ్యం భార్య అపర్ణ కోరుతున్నారని ఆయన తెలిపారు. 

మరోవైపు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ శనివారం అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో నిర్వహించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. ఇక, సుబ్రహ్మణ్యం మృతి కేసులో పోలీసులు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుంటామని అర్ధరాత్రి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చినట్టుగా వెల్లడించారు. 

ALso Read:సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్

అయితే సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో అతడిని కొట్టి చంపినట్టుగా తేలిందని సమాచారం. మృతుడి బట్టలపై బీచ్‌లో మట్టి, ఇసుక.. ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులు, తల మీద ఎడమవైపు గాయం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎడమ కాలు బొటన వేలుపై, కుడి కాలు మడెం దగ్గర, ఎడమ చేయి, పై పెదవిపై గాయాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉదయభాస్కర్‌ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు అనంత ఉదయభాస్కర్ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇక, ఈ కేసులో ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసనకు దిగారు. సుబ్రహ్మణ్యం మృతిపై టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో శనివారం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అపర్ణ శనివారం పగలు కనిపించకుండా పోయారు. 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh: కోట్లు విలువైన ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Rally మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం సీఎం ర్యాలీ| Asianet News Telugu