
సినిమా వాళ్ల పొట్ట మీద కొట్టి భయపెట్టారని ఏపీ ప్రభుత్వంపై టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మండిపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై కక్షతో (tollywood) వ్యవహరించారని ఆయన ఆరోపించారు. నిన్న జరిగింది చూస్తే ఇలా కూడా చేయొచ్చా అనిపించిందన్నారు చంద్రబాబు . తాను 40 ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశానని, ఆ తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని తెలిపారు. చిత్ర పరిశ్రమలో సమస్యను సృష్టించి.. దానిని పరిష్కరిస్తామనే నెపంతో ఆడుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సినీ పరిశ్రమకు చెందినవాళ్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారని.. అందులోనూ వేలు పెట్టారంటూ జగన్పై విమర్శలు చేశారు. సీఎంగా ఇన్నాళ్లు పనిచేశానని.. కానీ ఇవేవి తనకు తెలియదని, ఇప్పుడే నేర్చుకుంటున్నానని బాబు సెటైర్లు వేశారు.
అంతకుముందు తాము అధికారంలో ఉన్న సమయంలో Polavaramలో అవినీతి జరిగిందని YS Jagan చేసిన ఆరోపణల వీడియోను చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తమ ప్రభుత్వం లో ఉన్న సమయంలోని ఎస్టిమేషన్స్ నే తీసుకొన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. Visakhapatnam కు రైల్వే జోన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో ఆర్ధిక వ్యవస్థలు దిగజారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసే అప్పులు ప్రజలే తీర్చాల్సి ఉంటుందన్నారు.రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల అప్పుందన్నారు. బలవంతంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి జగన్ తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. జగన్ కు స్వంత లాభం తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు.. అన్ని వ్యవస్థలను జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు.రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపదను దోచుకొంటున్నారని చెప్పారు.
జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడంతో పాటు వేధింపులకు దిగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీనే ఉండదనుకొంటున్నారు, ఇతనే చివరి ముఖ్యమంత్రిగా జగన్ భావిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో పాటు, రైల్వేజోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర వాటిపై కేంద్రంతో జగన్ ఎందుకు తాడో పేడో తేల్చుకోవడం లేదో చెప్పాలన్నారు. తన కేసుల గురించే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
దేశంలో నిత్యావసరాలు, గ్యాస్, లిక్కర్ ధరలు ఏపీలోనే ఎక్కువ అని తెలిపారు. సహజ వనరుల దోపిడీకి పాల్పడుతూ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారని అన్నారు. నీతి నిజాయితీగా రాష్ట్రంలో రూపాయి కూడా ఎవరూ సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మృతులకు దేశమంతా ఎంతో కొంత పరిహారం ఇచ్చినా జగన్ మాత్రం రూపాయి సాయం కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు..
ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.. వైసీపీ నేతలు కోటీశర్వులౌతుంటే పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ప్రతి నెల పేదలపై వేల రూపాయాల అదనపు భారం ప్రభుత్వం మోపుతుందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.