అమిత్ షా , జేపీ నడ్డాలతో చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌ భేటీ.. పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం

Siva Kodati |  
Published : Mar 07, 2024, 10:55 PM ISTUpdated : Mar 07, 2024, 10:56 PM IST
అమిత్ షా , జేపీ నడ్డాలతో చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌ భేటీ.. పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం

సారాంశం

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీని కూడా కూటమిలోకి తీసుకురావాలని టీడీపీ, జనసేన భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. 

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీని కూడా కూటమిలోకి తీసుకురావాలని టీడీపీ, జనసేన భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు పలుమార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. కానీ అటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే కొద్దిరోజుల నుంచి మాత్రం బీజేపీ నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా పవన్, చంద్రబాబులకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వారిద్దరూ హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పొత్తు అంశంపై అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పొత్తులపై శుక్రవారం లోగా క్లారిటీ వస్తుందని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Weather Update: ఏపీలో సూర్యుడి ప్రతాపం.. బయటకు రాలేక అల్లాడిపోతున్న జనం | Asianet News Telugu
Nara Lokesh Speech:ఆరోజు అండగా నిలబడ్డారు.. అందుకే మీరుణం తీర్చుకోడానికి వచ్చా | Asianet News Telugu