టీడీపీ నేతపై ఎస్సై పిడిగుద్దులతో దాడి.. వైసీపీ వ్యతిరేక నిరసనలో ఉద్రిక్తత.. !!

Published : Jul 31, 2023, 04:23 PM ISTUpdated : Jul 31, 2023, 04:35 PM IST
టీడీపీ నేతపై ఎస్సై పిడిగుద్దులతో దాడి.. వైసీపీ వ్యతిరేక నిరసనలో ఉద్రిక్తత.. !!

సారాంశం

గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.

గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ యాదవ్‌పై ఎస్సై నాగరాజు పిడిగుద్దులతో దాడి చేశారు. వివరాలు.. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో  ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శలు గుప్పించారు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి పెయిడ్ ఆర్టిస్టును తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. 

అయితే ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్‌‌లో టీడీపీ బీసీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీ నేతల దిష్టిబొమ్మ దహనం చేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో టీడీపీ  నేతలను అదుపుచేస్తుండగా.. చంద్రశేఖర్‌ యాదవ్‌పై ఎస్సై నాగరాజు పిడిగుద్దులతో దాడి చేశారు.

ఇక, ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల విజయం వెనుక కష్టాలు విని మంత్రి లోకేష్ ఎమోషనల్ Shining Stars Award 2026 | Asianet Telugu
భోగాపురంలో స్కూల్ సందర్శించిన కేంద్ర మంత్రిచిన్నారుల ప్రతిభ కి నారా లోకేష్ ఫిదా| Asianet Telugu