నగరిలో ఉద్రిక్తత... రోజాపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు

First Published Jul 4, 2018, 1:47 PM IST
Highlights

నగరిలో ఉద్రిక్తత... రోజాపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు

చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకుంది. నగరిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించేందుకు మంత్రి అమర్‌నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే రోజా కూడా అక్కడికి చేరుకున్నారు.. అయితే ఆమెను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

click me!