వివేకా హత్య కేసు: సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగింపు.. నార్కో అనాలిసిస్ టెస్ట్‌పై తీర్పు రిజర్వ్

Siva Kodati |  
Published : Sep 01, 2021, 02:23 PM IST
వివేకా హత్య కేసు: సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగింపు.. నార్కో అనాలిసిస్ టెస్ట్‌పై తీర్పు రిజర్వ్

సారాంశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్‌కు రిమాండ్‌ను 15 రోజులకు పొడిగించింది జమ్మలమడుగు కోర్ట్. సునీల్ యాదవ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్ అనుమతిపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.   

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్‌కు రిమాండ్‌ను 15 రోజులకు పొడిగించింది జమ్మలమడుగు కోర్ట్. సునీల్ యాదవ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్ అనుమతిపై వాదనలు విన్నారు జమ్మలమడుగు మేజిస్ట్రేట్. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. 

అంతకుముందు ఆగస్టు 16న సునీల్ యాదవ్ ను  మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు పులివెందుల కోర్టు నిరాకరించింది. గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో 10 రోజుల క్రితం కస్టడీలోకి తీసుకొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్ తర్వాత కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ కేసులో  పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు