‘‘రేవంత్ టీడీపీని వీడింది.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకే..అంతా బాబు స్కెచ్’’

sivanagaprasad kodati |  
Published : Oct 02, 2018, 01:04 PM IST
‘‘రేవంత్ టీడీపీని వీడింది.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకే..అంతా బాబు స్కెచ్’’

సారాంశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కాంగ్రెస్‌ను బతికించేందుకు చంద్రబాబు ప్రయత్రిస్తున్నారని.. దీనిలో భాగంగానే తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తిని కాంగ్రెస్‌లోకి పంపారని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కాంగ్రెస్‌ను బతికించేందుకు చంద్రబాబు ప్రయత్రిస్తున్నారని.. దీనిలో భాగంగానే తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తిని కాంగ్రెస్‌లోకి పంపారని ఆరోపించారు.

కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని.. ఎన్టీఆర్ ఆశయాలను కాలరాసేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నరాని విమర్శించారు. బాబు ఊసరవెల్లి రాజకీయాలను నడుపుతున్నారని.. ఆయన అవినీతికి చరమగీతం పాడబోతున్నామని తెలిపారు.

పోలవరం, ఇళ్ల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం ఇలా ప్రతి పనిలో అవినీతేనని ఆరోపించారు. సీఎం రాష్ట్రంలో ఇసుక మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే
Heavy Rain Alert!: వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు భారీ వర్షాలు| Asianet News Telugu