
ఒంగోలు : ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్.. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. కోటి ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమెకు నిత్యం నరకం కనిపించింది. భర్తతో పాటు మామ కూడా చేయి చేసుకుంటున్నాడు.. అంటూ తండ్రికి ఫోన్లో మొరపెట్టుకుంది. చివరకు ఇంట్లోకి సైతం రానివ్వడం లేదు అంటూ విలపించింది.
ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తన కుమార్తె ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషాద సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగింది. జిల్లాలోని రాచర్ల మండలం సోమిదేవి పల్లి కి చెందిన రిటైర్డ్ మిలటరీ ఉద్యోగి అయినాబత్తుల వెంకటేశ్వర్లు కుమార్తె స్వాతికి, ఒంగోలు భాగ్యనగర్ లో ఉంటున్న సంగ శ్రీహరి కుమారుడు వెంకట శ్రీకాంత్ కు గత ఏడాది మే నెల 13న వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో వెంకటేశ్వర్లుకు కట్నంగా 25 తులాల బంగారం, 50 లక్షలు ఇచ్చారు. స్వాతి హైదరాబాద్ లోని విప్రో కంపెనీ లో, వెంకటశ్రీకాంత్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీహరికి గత ఏడాది జూలైలో యాక్సిడెంట్ కావడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
డబ్బులున్న అమ్మాయిలే టార్గెట్... 11 మందితో పెళ్లి పేరుతో ఛాటింగ్..రూ.3 కోట్లకు టోకరా !
మరోవైపు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తూ స్వాతి దంపతులు ఒంగోలులోని శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. శ్రీహరి ఉద్యోగం చేయలేని నేపథ్యంలో కుమారుడు వెంకట శ్రీకాంత్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి స్వాతిని వదిలించుకోవాలని పథకం పన్నారు. నల్లగా ఉన్నావ్.. అంటూ కించపరుస్తూ, విడాకులు ఇవ్వాలంటూ వేధించారు.
ఈ ఏడాది మార్చిలో స్వాతిని పుట్టింటికి పంపారు. మళ్లీ పెద్దల సమక్షంలో ఈ ఏడాది జూలైలో స్వాతి ఒంగోలులోని అత్తగారింటికి చేరింది. అప్పటి నుంచి భర్త, మామ శారీరకంగా, మానసికంగా హింసించసాగారు. శనివారం రాత్రి ఆమెను కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వాతి తన తండ్రికి ఫోన్ చేసి తను ఇంట్లోకి రానిచ్చారని చెప్పింది. 5.07 నిమిషాలకు ఆయనకు వాచ్మెన్ ఫోన్ చేసి స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.
వెంటనే ఒంగోలు చేరుకున్న వెంకటేశ్వర్లు దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. తమ కుమార్తెను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశా పోలీసులు... స్వాతి భర్త, అత్త మామలతో పాటు మరికొందరిపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వాతి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.