మంత్రి విడదల రజిని కాన్వాయ్‌లో ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు.. తప్పిన ప్రమాదం..

Published : Oct 09, 2022, 02:50 PM ISTUpdated : Oct 09, 2022, 02:52 PM IST
మంత్రి విడదల రజిని కాన్వాయ్‌లో ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు.. తప్పిన ప్రమాదం..

సారాంశం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి విడదల రజిని పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. మార్కాపురం మండలం రాయవరం వద్ద మంత్రి విడదల రజిని కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి విడదల రజిని పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. మార్కాపురం మండలం రాయవరం వద్ద మంత్రి విడదల రజిని కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. బైక్‌ను తప్పించే క్రమంలో ఒక కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే ఆ సమయంలో మంత్రి విడదల రజిని వాహనంలో లేకపోవడంతో ప్రమాదం  తప్పింది. ఆ సమయంలో మంత్రి విడదల రజిని.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాహనంలో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్