అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

By narsimha lodeFirst Published Nov 22, 2022, 3:53 PM IST
Highlights

అల్లూరి జిల్లాలోని  చింతూరులో  మంగళవారంనాడు  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.  మరో  ముగ్గురు  గాయపడ్డారు.మృతులంతా  ఛత్తీస్‌ఘడ్  రాష్ట్రానికి  చెందినవారు.

చింతూరు: అల్లూరి జిల్లాలోని  చింతూరు మండలంలో  మంగళవారంనాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు  మృతి  చెందారు. వ్యాన్, లారీ డీకొనడంతో ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  చింతూరు  మండలం  బొడ్డుగూడెంలో  ఈ  ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు  మృతి చెందారు.మరో  ముగ్గురు  గాయపడ్డారు. గాయపడిన  వారిని సమీపంలోని  ఆసుపత్రికి  తరలించారు. భద్రాచలంలో  శ్రీరామచంద్రస్వామని  దర్శించుకొని  చత్తీస్ ఘడ్ కు  వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  వ్యాన్  డ్రైవర్  అతివేగంగా  వాహనాన్ని నడపడంతోనే  ఈ ప్రమాదం  జరిగిందని  ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

దేశ  వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో రోజుకు  పలు రోడ్డు ప్రమాదాలు  జరుగుతున్నాయి. డ్రైవర్ల  నిర్లక్ష్యంతో పాటు , రోడ్లు  సరిగా  లేని  కారణంగా  ప్రమాదాలు  జరుగుతున్నాయి.  నిద్రమత్తులో  డ్రైవింగ్ చేయడంతో పాటు అతి వేగంగా  డ్రైవింగ్ చేయడంతో  ప్రమాదాలు  చోటు  చేసుకుంటున్నాయి.యూపీ  రాష్ట్రంలోని  ఆజంఘడ్  లో  ఈ  నెల  20వ  తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు మృతి  చెందారు. తెలంగాణలోని  వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం బొమ్మలపల్లి  వద్ద  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు  మృతి  చెందారు.ఈ  ఘటన ఈ నెల 20వ  తేదీన జరిగింది.

ఆర్టీసీ  బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో  ఈ ప్రమాదం జరిగింది.  హైద్రాబాద్  నుండి  బెంగుళూరు  ఆర్టీసీ  బస్సు  వెళ్తుంది. ఈ  నెల 16న ఉత్తరాఖండ్  లో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో పది  మంది  మృతి  చెందారు. చమోలి  వద్ద  బస్సు లోయలో పడడంతో  ఈ  ప్రమాదం  చోటు  చేసుకుంది. సత్యసాయి  జిల్లాలోని  కనగానపల్లి  మండలం  పర్వతదేవరపల్లి వద్ద  కల్వర్టు గోడను  కారు  ఢీకొనడంతో  ముగ్గురు మృతి  చెందారు.మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని దరియా పోలీస్ స్టేషన్ పరిధిలో  ఈ  నెల  6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు.మరో  25  మంది  గాయపడ్డారు. 


 

click me!