వివాహానికి వెళ్తూ ప్రమాదానికి గురై ఆరుగురు మృతి

Published : Aug 24, 2018, 08:15 AM ISTUpdated : Sep 09, 2018, 12:08 PM IST
వివాహానికి వెళ్తూ ప్రమాదానికి గురై ఆరుగురు మృతి

సారాంశం

అనంతపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బొలేరో మినీ లారీ బోల్తా కొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది. 

మినీ లారీలో అనంతపురంలోని ఓ వివాహానికి హాజరు కావడానికి వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations