వివాహానికి వెళ్తూ ప్రమాదానికి గురై ఆరుగురు మృతి

Published : Aug 24, 2018, 08:15 AM ISTUpdated : Sep 09, 2018, 12:08 PM IST
వివాహానికి వెళ్తూ ప్రమాదానికి గురై ఆరుగురు మృతి

సారాంశం

అనంతపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బొలేరో మినీ లారీ బోల్తా కొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది. 

మినీ లారీలో అనంతపురంలోని ఓ వివాహానికి హాజరు కావడానికి వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Perni Nani Comments: బుడబుక్కల ఎమ్మెల్యేలు వెంట్రుకతో సమానం: పేర్ని నాని | Asianet News Telugu
Meenakshi Kalyanam Festival: కన్నులపండుగలా మధురైమీనాక్షి అమ్మవారికళ్యాణమహోత్సవం| Asianet News Telugu