నెలకు లక్షా ఆరు వేల అద్దె కట్టాలని నోటీసులు ఇవ్వడంతో విజయవాడ దుర్గగుడి సమీపంలోని కనకదుర్గ నగర్లో దుకాణదారులంతా ఆందోళన చేపట్టారు.
విజయవాడ కనకదుర్గ ఆలయ ఆవరణలోని షాపుల యజమానులందరూ శనివారం ఆందోళనకు దిగారు. ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని మరి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలయ నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలు కల్పించకపోయినా , భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు షాపుల యజమానులు. నెలకు లక్షా ఆరు వేల అద్దె కట్టాలని నోటీసులు ఇవ్వడంతో విజయవాడ దుర్గగుడి సమీపంలోని కనకదుర్గ నగర్లో దుకాణదారులంతా ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.