చిత్తూరు జిల్లాలో కలకలం .. వైరస్‌తో ఏడు నెమళ్లు మృతి

By Siva KodatiFirst Published Feb 11, 2022, 6:16 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లె సమీప పూలకొండలోని వద్ద ఏడు నెమళ్లు మృతి చెందాయి. రైతులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. 

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లె సమీప పూలకొండలోని వద్ద ఏడు నెమళ్లు మృతి చెందాయి. రైతులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. అనంతపురం చీఫ్‌ కన్జ ర్వేటర్‌ (సీసీఎఫ్‌) శ్రీనివాస శాస్త్రి సంఘటనా స్ధలానికి గురువారం చేరుకున్నారు. పెద్ద ఉప్పరపల్లె పశువైద్యాధికారి చందనప్రియ, చిత్తూరు డీఎఫ్‌వో రవిశంకర్‌, ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెమళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు. గాలిలో వచ్చే వైరస్‌తో నెమళ్లు మృతిచెందాయని ప్రాథమికంగా నిర్ధారించారు. 

click me!