చంద్రబాబు, పవన్ కు ఒకే పంచ్

Published : Jan 31, 2018, 05:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
చంద్రబాబు, పవన్ కు ఒకే పంచ్

సారాంశం

తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

రాయలసీమలో పాదయాత్ర విజయవంతం అవ్వటంతో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలో ఆత్మ విశ్వాసం బాగా హై లెవల్లో ఉన్నట్లుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. మరో పది రోజులు ఈ జిల్లాలోనే జగన్ పాదయాత్ర ఉంటుంది. మంచి జోష్ లో ఉన్న జగన్ బుధవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తమ ముందు ఏ సేన కూడా నిలబడలేందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జనసేన చీలుస్తుందా అన్న ప్రశ్నకు జగన్ పై విధంగా స్పందించారు. ‘జనసేనే కాదు ఏ సేన కూడా తమ ముందు నిలవలేంద’న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలక వస్తుందని అనుకోవటం లేదని గట్టిగా చెప్పారు.

జనాలందరూ మూడున్నరేళ్ళ చంద్రబాబునాయుడు పాలనపై బాగా విసిగిపోయున్నట్లు చెప్పారు. జనసేన-చంద్రబాబు ఒకటే అన్న విషయాన్ని జనాలు గ్రహించినట్లు తెలిపారు. మూడున్నరేళ్ళ క్రితం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణాన్ని జనాలు వచ్చే ఎన్నికల్లో వదిలించేస్తారంటూ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu