సూళ్లూరుపేట కౌన్సిలర్ సురేష్ హత్యకేసులో ట్విస్ట్: అస్థికల్లో కత్తెర లభ్యం

Published : Aug 11, 2021, 04:49 PM ISTUpdated : Aug 11, 2021, 04:50 PM IST
సూళ్లూరుపేట కౌన్సిలర్ సురేష్  హత్యకేసులో ట్విస్ట్: అస్థికల్లో కత్తెర లభ్యం

సారాంశం

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో హత్యకు గురైన కౌన్సిలర్ సురేష్ హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఆయన అస్థికల్లో కత్తెర లభ్యమైంది. ఈ కత్తెర సహాయంతోనే  సురేష్ ను  హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసే సమయంలో కూడ వైద్యులు కత్తెరను గుర్తించలేదా అనే విషయమై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు ఈ కేసులో బాలు అనే అనుమానితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట  కౌన్సిలర్ సురేష్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకొంది. సురేష్ అస్థికల్లో టైలరింగ్ కత్తెర లభ్యమైంది. పోస్టుమార్టం చేసే సమయంలో ఈ కత్తెరను వైద్యులు గుర్తించలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

also read:సూళ్లూరుపేట కౌన్సిలర్ సురేష్ హత్య: నిందితుడు బాలు లొంగుబాటు

రెండు రోజుల క్రితం సరష్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు గురైన సురేష్ మృతదేహన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. స్థానికంగా ఉన్న స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియ తర్వాత అస్థికలను  పవిత్ర నదిలో కలిపేందుకు సేకరిస్తున్న సమయంలో  కత్తెర లభ్యమైంది.

సురేష్ ను ఈ కత్తెర సహాయంతోనే నిందితుడు హత్య చేశాడా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. సురేష్ ను హత్య చేశానని బాలు అనే వ్యక్తి బుధవారం నాడు పోలీసులకు లొంగిపోయాడు. సురేష్  ఆర్ధిక లావాదేవీల్లో బాలు బినామీగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఈ నెల 9వ తేదీన సూళ్లూరుపేట రైల్వేగేటు వద్ద సురేష్  దారుణంగా హత్యకు గురయ్యాడు. పుట్టినరోజునే ఆయన హత్యకు గురికావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.సురేష్ ను హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులపై బాలును పోలీసులు విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna REddy Pressmeet: మీ ఆటలు సాగవు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్| Asianet News Telugu
Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్