ఉగ్రరూపం చూపిస్తానని.. వంగి వంగి సలామ్ చేశారు

Published : Jun 18, 2018, 06:20 PM IST
ఉగ్రరూపం చూపిస్తానని.. వంగి వంగి సలామ్ చేశారు

సారాంశం

ఉగ్రరూపం చూపిస్తానని.. వంగి వంగి సలామ్ చేశారు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఫైర్‌బ్రాండ్, ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఇవాళ శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల విషయంలో మోడీని నిలదీస్తానని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెబుతానని చెప్పిన చంద్రబాబు.. ఢిల్లీలో మోడీని చూడగానే ఆయనకు వంగి వంగి సలాములు చేశారని విమర్శించారు. సీఎం పోరాటాలు చేసే వ్యక్తి కాదని.. ఆయన ఒక అవకాశవాదని.. అందితే జుట్టు లేకుంటే... కాళ్లు పట్టుకునే వ్యక్తని రోజా ఆరోపించారు.. ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న చంద్రబాబు అక్కడికి వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రధానికి సలాములు చేసేందుకే ఢిల్లీ వెళ్లారని.. మోడీని కలిసిన సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో ఓ పక్క భయం.. మరో పక్క పిచ్చి నవ్వు కనిపించందని ఎద్దేవా చేశారు.. ఒలంపిక్స్‌లో వంగి నమస్కారాలు పెట్టే పోటీ పెడితే చంద్రబాబు మొదటి బహుమతి సాధిస్తారని రోజా అన్నారు.

PREV
click me!

Recommended Stories

Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu