ఆగివున్న లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, 25 మందికి గాయాలు

By Siva KodatiFirst Published Jul 2, 2019, 8:18 AM IST
Highlights

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ వద్ద 40వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ వద్ద 40వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు భక్తులు తిరుపతి, కాణిపాకం దర్శించుకుని మహానంది వస్తుండగా ఈ  ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఒకరు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

click me!