కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 8మంది మహిళల పరిస్థితి విషమం

Arun Kumar P   | Asianet News
Published : Jun 20, 2020, 12:23 PM IST
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 8మంది మహిళల పరిస్థితి విషమం

సారాంశం

 కర్నూలు జిల్లా డోన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

 కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నేషనల్ హైవేపై ఎదురెదురుగా వచ్చిన లారీ, ఆటో డీకొన్నారు. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు వున్నారు. వీరందరూ తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో గాయపడిని వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలించారు. ఇందులో ఒ చిన్నారి కూడా వున్నట్లు తెలుస్తోంది. 

read more   సుశాంత్ సూసైడ్: భరించలేక తెలుగు అభిమాని ఆత్మహత్య

డోన్ పక్కన మల్లంపల్లె గ్రామానికి చెందిన పొదుపు గ్రూపు మహిళలు ఆటోలు బ్యాంక్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారందరు మహిళలే వుండగా అందులో ఓ చిన్నారి కూడా వుంది. వీరంతా తీవ్ర గాయాలతో పడివుండటాన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu
YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu