విశాఖలో రియల్టర్ మధు కిడ్నాప్: రౌడీషీటర్‌పై సీపీకి బాధిత కుటుంబం ఫిర్యాదు

Published : Feb 17, 2023, 05:02 PM IST
విశాఖలో రియల్టర్ మధు కిడ్నాప్: రౌడీషీటర్‌పై సీపీకి  బాధిత కుటుంబం ఫిర్యాదు

సారాంశం

విశాఖపట్టణంలో  రియల్టర్  మధు  కిడ్నాప్  కలకలం రేపుతుంది.  మధు కుటుంబ సభ్యులు  విశాఖ సీపీని కలిసి ఈ విషయమై  ఫిర్యాదు  చేశారు.   

విశాఖపట్టణం:  విశాఖపట్టణంలో  రియల్టర్  మధు  కిడ్నాప్  ఘటన  కలకలం  రేపుతుంది.  రియల్టర్   కుటుంబ సభ్యులు  విశాఖపట్టణం సీపీ శ్రీకాంత్ ను  శుక్రవారం నాడు కలిశారు.   కిడ్నాప్‌నకు పాల్పడిన  రౌడీ షీటర్  పై  చర్య తీసుకోవాలని  మధు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.  విశాఖపట్టణానికి  చెందిన  రియల్టర్  మధు, రౌడీ షీటర్  హేమంత్  మధ్య ప్లాట్ విక్రయం విషయంలో  గొడవ  చోటు  చేసుకుంది.  

ఈ విషయమై  రూ.  12 లక్షలు చెల్లించాలని  రియల్టర్  మధును  రౌడీ షీటర్  హేమంత్ కుమార్ డిమాండ్  చేసినట్టుగా  మధు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని  విశాఖపట్టణం సీపీ  శ్రీకాంత్ కు  ఫిర్యాదు చేశారు.  ఈ వివాదం  కారణంగానే  మధును  రౌడీ షీటర్  హేమంత్ కిడ్నాప్  చేసినట్టుగా  రియల్టర్  కుటుంబ సభ్యులు  పోలీసులకు చెప్పారు. రియల్టర్  మధు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. మధు కిడ్నాప్‌నకు  సహకరించారనే అనుమానంతో  ఏడుగురిని  విశాఖపట్టణం  పోలీసులు  అదుపులోకి తీసుకొని  ప్రశ్నిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం