జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ... రామలింగరాజుకే ఆ బాధ్యతలు

Arun Kumar P   | Asianet News
Published : Jul 09, 2021, 10:11 AM IST
జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ... రామలింగరాజుకే ఆ బాధ్యతలు

సారాంశం

జగన్ సర్కార్ కు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ కాకినాడ విసిగా రామలింగరాజు తొలగింపుపై స్టే విధించింది న్యాయస్థానం. 

అమరావతి: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో వైసిపి సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత మేలో కాకినాడ  జేఎన్టీయూ వైస్ చాన్స్ లర్ పదవినుండి రామలింగరాజును తొలగించింది వైసిపి ప్రభుత్వం. ఆ స్థానంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ను నియమించింది.  

అయితే తనను వైస్ చాన్సలర్ గా తొలగించడంతో రామలింగరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రామలింగరాజు తొలగింపుపై స్టే ఇచ్చింది. దీంతో తిరిగి రామలింగరాజు ను జేఎన్టీయూ వీసీగా నియమిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

కిమ్స్ కార్డియాలజిస్టుకు జాతీయ స్థాయి గుర్తింపు.. అరుదైన శస్త్ర చికిత్సకు గౌరవంగా
Weather Update : ఈ తెలుగు జిల్లాల్లో వింత వెదర్.. పగలంతా పీక్ ఎండలతో ఆరెంజ్, సాయంత్రం జోరువానలతో ఎల్లో అలర్ట్