Breaking news : తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ

By SumaBala BukkaFirst Published Nov 27, 2023, 7:09 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం 8 గం.లకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం 8 గం.లకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి శ్రీ రచన అతిథి గృహానికి మోడీ చేరుకుంటారు. శ్రీ రచన అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రదాని. అక్కడి నుంచి తిరిగి హైదరాబాదుకు చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ రోజు తెలంగాణలో సాయంత్రం మోదీ రోడ్ షోలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!