వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్ సంస్థ జరిపిన ప్రీ పోల్ సర్వేలో తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది.
అమరావతి: ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాన్ని సీ - ఓటరు ప్రీ పోల్ సర్వే తేల్చింది. జగన్ హవా కొనసాగుతుందని, చంద్రబాబుకు ఎదురు దెబ్బ తప్పదని ఆ సర్వే తేల్చింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్ సంస్థ జరిపిన ప్రీ పోల్ సర్వేలో తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది.
ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బ తింటుందని సెప్టెంబర్ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీ చేస్తే ఎపిలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీకి 21 సీట్లు, టీడీపీకి 4 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.
బీజేపీ, కాంగ్రెస్లకు ఒక్క సీటు కూడా రాదని తేల్చింది. ఓట్ల శాతం చూస్తే... వైఎస్సార్సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వివరించింది.
2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది.
సంబంధిత వార్త
ప్రీ పోల్ సర్వే: టీఆర్ఎస్ కు 9, కాంగ్రెసుకు 6, టీడీపి మటాష్