ఫలితాలను ఆసక్తికి వీక్షిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ టీం

Published : May 23, 2019, 08:16 AM IST
ఫలితాలను ఆసక్తికి వీక్షిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ టీం

సారాంశం

తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలోని వార్ రూంలో ఐప్యాక్ టీం ఎన్నికల కౌంటింగ్ సరళిని ఆసక్తిగా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్ టీం ఇచ్చిన రిజల్ట్స్, ఎన్నికల ఫలితాల్లో ఎన్ని వస్తాయా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తోందని ముందుగానే చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఎన్నికల కౌంటింగ్ సరళిపై ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలోని వార్ రూంలో ఐప్యాక్ టీం ఎన్నికల కౌంటింగ్ సరళిని ఆసక్తిగా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్ టీం ఇచ్చిన రిజల్ట్స్, ఎన్నికల ఫలితాల్లో ఎన్ని వస్తాయా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ఏపీ ప్రజలు వైసీపీకే పట్టం కట్టారంటూ తాము ఇచ్చిన రిపోర్ట్ కు ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయా లేదా అన్న కోణంలో ఐ ప్యాక్ టీం ఆసక్తిగా కౌంటింగ్ ను పరిశీలిస్తోంది. ఇకపోతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ వైసీపీ అధినేత వైస్ జగన్ తో కలిసి తాడేపల్లిలో ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్