ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపీడీలు.. సహకరించిన కానిస్టేబుల్.. అరెస్ట్..

Published : Apr 24, 2021, 02:40 PM IST
ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపీడీలు.. సహకరించిన కానిస్టేబుల్.. అరెస్ట్..

సారాంశం

ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు దొంగిలిస్తున్న దోపిడీ ముఠాని  గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాతో పాటు దొంగిలించిన వస్తువుల విక్రయానికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన బంగారు నగల వ్యాపారిని అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు దొంగిలిస్తున్న దోపిడీ ముఠాని  గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాతో పాటు దొంగిలించిన వస్తువుల విక్రయానికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన బంగారు నగల వ్యాపారిని అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వారి నుండి రూ. 2,50,000 విలువ చేసే ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి మాట్లాడారు. 

వెంగళాయపాలెంలోని శ్రీశైలం కాలనీలో  నివాసం ఉంటున్న పువ్వాడ విజయలక్ష్మీ ఒంటరిగా ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో.. చింతలపూడి సాగర్ బాబు, పాదర్తి సురేష్, అచ్చి చిన్న సైదారావు అనే వ్యక్తులు ఆమె మెడలోని చైన్ని లాక్కొని పారిపోయారు. 

మొత్తం నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వీరంతా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా ఆభరణాలు చోరీ చేస్తున్నారని, ఇలాంటి పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu