ఈ-వాచ్ యాప్‌పై జగన్ సర్కార్ పిటిషన్: విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు

Published : Feb 04, 2021, 10:24 AM ISTUpdated : Feb 04, 2021, 11:00 AM IST
ఈ-వాచ్ యాప్‌పై జగన్ సర్కార్ పిటిషన్: విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు

సారాంశం

 ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించనుంది.

అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించనుంది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించనుంది.ఈ-వాచ్ యాప్ పై వైఎస్ఆర్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ యాప్ టీడీపీ కనుసన్నల్లో తయారైందని అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  అయితే ఈ అనుమానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఈ యాప్ ను బుధవారం నాడు ఆవిష్కరించారు.యాప్ పనితీరును వివరించారు.ఈ యాప్‌నకు వ్యతిరేకంగా  వైఎస్ఆర్‌సీపీ మరో యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-నేత్రం పేరుతో మరో యాప్ ను మరోసారి అందుబాటులోకి తెచ్చింది.

also read:ఎస్ఈసీ యాప్‌పై లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరణ: రేపు విచారిస్తామన్న హైకోర్టు

ఈ-వాచ్ యాప్ పై అనుమానాలను వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ వినతిపత్రాన్ని సమర్పించింది.  తమ అనుమానాలను ఈ వినతిపత్రంలో ప్రస్తావించింది.ఈ నేత్రం యాప్  ద్వారా తమకు అందిన ఫిర్యాదులను వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎస్ఈసీకి అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించనుంది.
 

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu