టీడీపీతో చెడింది కదా అని.. ఏపీకి అన్యాయం చేయొద్దు.. పవన్

Published : Jul 20, 2018, 10:44 AM IST
టీడీపీతో చెడింది కదా అని.. ఏపీకి అన్యాయం చేయొద్దు.. పవన్

సారాంశం

టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ఈ రోజు పార్లమెంట్ లో ఈ విషయంపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై పవన్ ట్విట్టర్ లో స్పందించారు.

 

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజల పక్షాన కేంద్రాన్ని కోరుతున్నట్లు పవన్ తెలిపారు. టీడీపీతో చెడినందున... వారిపై కోపంతో ప్రత్యేక హోదా నిరాకరించటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజల హక్కులు సాధించుకునేందుకు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంటు సరైన వేదికగా భావిస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Bhogapuram Airport : ఆంధ్ర ప్రదేశ్ పై ప్రధాని వరాలు... కేంద్రం ఏమేం చేస్తుందో చెప్పిన నరేంద్ర మోదీ
Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్