మంచినీటి కోసం మహిళల మధ్య ఘర్షణ, మహిళ మృతి

Published : Jul 15, 2019, 10:56 AM IST
మంచినీటి కోసం మహిళల మధ్య ఘర్షణ, మహిళ మృతి

సారాంశం

 శ్రీకాకుళ: జిల్లా సోంపేట మండలంలోని పల్లివీధిలో కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో పద్మ అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం నాడు ఉదయం చోటు చేసుకొంది.

శ్రీకాకుళం: శ్రీకాకుళ: జిల్లా సోంపేట మండలంలోని పల్లివీధిలో కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో పద్మ అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం నాడు ఉదయం చోటు చేసుకొంది.

తాటిపూడి పద్మ మంచినీటిని పట్టుకొనేందుకు కుళాయి వద్ద క్యూలో నిల్చుంది.  నీటిని పట్టుకొనే విషయంలో  మహిళలు పోటీలు పడ్డారు. క్యూ తప్పింది. దీంతో  మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  దీంతో మహిళలు బిందెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు.

ఈ ఘటనలో పద్మ గుండె, తల భాగంలో తీవ్ర గాయాలైనట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.  ఈ  గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అమరావతే శాశ్వత రాజధాని: జగన్ పై వర్ల రామయ్య ఫైర్ | Varla Ramaiah Pressmeet | Asianet News Telugu
నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన CM Chandrababu Nellore, Kadapa Tour| Asianet Telugu